పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ కి రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు గోపీ సుందర్. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా నుంచి గోపీసుందర్ తప్పుకున్నారట. కారణాలు తెలీడంలేదుగానీ... రీ-రికార్డింగ్ పూర్తవ్వకుండా గోపీసుందర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం గోపీసుందర్ స్థానంలో సంగీత దర్శకుడు తమన్ ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. తమన్ రీ-రికార్డింగ్ పూర్తి చేయబోతున్నాడట. మరి ఈ మార్పుకు కారణమేంటో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్స్ కి వస్తోంది. మరి పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత జత కట్టిన ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం.