మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత 20రోజుల పాటు చైనాలో ఓ షెడ్యూల్ ని జరపడానికి ప్లాన్ చేస్తోందట చిత్రం యూనిట్. ఈ 20రోజుల షెడ్యూల్ తో ఆల్ మోస్ట్ 'సైరా' షూటింగ్ పూర్తయిపోతుందని సమాచారమ్.
చిరు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చైనా షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారట. ఈ యేడాది సెకండాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, తమన్నా, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.