కింగ్ నాగార్జున సూపర్ హిట్ ఫిలిమ్ 'మన్మధుడు' కి సీక్వెల్ గా 'మన్మధుడు 2' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చి.ల.సౌ ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్నఈ సినిమా నేడు (25.3.2019) లాంఛనంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చిత్ర యూనిట్తో పాటు అక్కినేని అమల, నాగచైతన్య ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) నిర్మిస్తున్న మన్మథుడు 2 చిత్రం ముహుర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్ కొట్టగా.. అక్కినేని నాగచైతన్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు రాహుల్ రవీంద్రన్. RX100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.