స్టైలిష్ అల్లు అర్జున్ 19న సినిమా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ 20వ సెట్స్ పైకి వెళ్లనుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ 20వ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం 'ఛలో' బ్యూటీ రష్మిక మందన్నాని హీరోయిన్ గా ఖరారు చేసారట సుకుమార్. ఇది నిజంగా అమ్మడికి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్, రష్మిక జత కట్టబోతున్నారు. మరి ఈ జంట ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇదిలా ఉంటే...
త్రివిక్రమ్, అల్లు అర్జున్... సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుంది. ఆర్య, ఆర్య 2 చిత్రాలు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కాయి. ఇప్పుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ 19వ సినిమా, సుకుమార్ తో అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందనున్నాయి. మరి ముచ్చటగా మూడోసారి కలుస్తున్న ఈ కాంబినేషన్ సినిమాలు ఎలాంటి కథలతో తెరకెక్కనున్నాయో, అల్లు అర్జున్ కి ఏ రేంజ్ విజయాన్ని అందించనున్నాయో వేచిచూద్దాం.