మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బెస్త కమ్యూనిటీ (ఫిషర్ మ్యాన్స్) కి చెందిన బ్యాక్ డ్రాప్ తో ఈ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది.
కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్ గా నటింపజేయడానికి డైరెక్టర్ సుకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజా వార్తల ప్రకారం చెన్నై బ్యూటీ మేఘాఆకాష్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారమ్. మనీషారాజ్ ని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు వచ్చినప్పటికీ, ఆమెను మేఘాఆకాష్ తో రీప్లేస్ చేస్తున్నారనేది తాజా సమాచారమ్.