మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత రాంచరణ్ చేయబోయే సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
'ఎవడు' లాంటి హిట్ చిత్రం తనకు ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో రాంచరణ్ ఉన్నాడని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ ఆలోచన రాంచరణ్ కి ఉన్న మాట నిజమేనట. కాకపోతే మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న 'మహర్షి' చిత్రం రిజల్ట్ చూసిన తర్వాతే వంశీ దర్శకత్వంలో సినిమా చేయడం గురించి ఓ నిర్ణయం తీసుకోవాలని ఫిక్సయ్యాడట. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్న రాంచరణ్ ఆ తర్వాత వేసే అడుగులు కూడా జాగ్రత్తగా వేయాలని, ఎలా పడితే అలా సినిమాలు అంగీకరించకూడదనుకుంటున్నాడట. సో... దీన్నిబట్టి చాలా తెలివిగా రాంచరణ్ అడుగులు వేస్తున్నాడని చెప్పొచ్చు.