అక్కినేని అఖిల్ తదుపరి సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ఓ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో అఖిల్ అక్కినేని ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ సెట్ అవ్వలేదట. బాలీవుడ్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కియారా అద్వాని ఈ సినిమాకి నో చెప్పిందట. దాంతో హీరోయిన్ కోసం మళ్లీ వేట మొదలయ్యిందట. మరి ఫైనల్ గా అఖిల్ సరసన నటించే అవకాశం ఏ హీరోయిన్ కి దక్కుతుందో వేచిచూడాల్సిందే.