వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి 'చిత్రలహరి' చిత్రంతో కొంత ఊరట లభించింది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ మెగా మేనల్లుడుని మేనమామ, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. 'చిత్రలహరి' చిత్రం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.
'చిత్రలహరి' సినిమాని పవన్ కళ్యాణ్ చూసారు. ఆయనకు సినిమా బాగా నచ్చడంతో యూనిట్ను అభినందిస్తూ చిత్ర యూనిట్కు ఫ్లవర్ బొకెలను పంపారు. కంగ్రాట్స్... మీ వర్క్ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను అంటూ మెసేజ్ కూడా పంపారు పవన్ కల్యాణ్. సో... మెగా మేనల్లుడుకి మామయ్యల సపోర్ట్ బాగానే దక్కిందని చెప్పొచ్చు.