'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్', 'అఅఆ'... ఈ నాలుగు సినిమాలు డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్ ని డైలమాలో పడేసాయి. వరుస ఫ్లాపులతో ఇక శ్రీను వైట్ల కెరియర్ ముగిసిపోయినట్టేనని జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీను వైట్ల ఓ స్టెప్ తీసుకున్నాడు. ఈ స్టెప్ వల్ల అతను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శ్రీను వైట్ల మల్టీస్టారర్ లో ప్లానింగ్ లో ఉన్నాడట. ఆ వివరాల్లోకి వెళితే...
కోన వెంకట్, గోపీ మోహన్, శ్రీను వైట్ల... ఈ ముగ్గురి కాంబినేషన్ లో హిట్ సినిమాలు తెరకెక్కాయి. అయితే వారి మధ్య ఏర్పడ్డ మనస్ఫర్ధలు వల్ల ముగ్గురూ విడిపోయారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసిపోయి ఓ స్టోరీ లైన్ రెడీ చేసారట.
ఈ స్టోరీ లైన్ తో ఓ హీరోని కలవడం, ఆ హీరో స్ర్కిఫ్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం మరో హీరోని ఒప్పించే ప్రయత్నంలో ఈ ముగ్గురూ ఉన్నారని వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని, జూన్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారమ్.