'పొన్నియన్ సెల్వన్' టైటిల్ తో ఓ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రానికి లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్యరాయ్, విజయ్ సేతుపతి, జయం రవి, కీర్తి సురేష్ కీలక పాత్రలు చేయబోతున్నారు. ఈ సినిమాలో పూంగుళల్ పాత్ర అత్యంత కీలకమైనది. ఈ పాత్ర కోసం ముందుగా అనుష్కను అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ పాత్రను నయనతారతో చేయించాలని మణిరత్నం భావించినట్టు వార్తలు వచ్చాయి. నయనతార కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించిందని సమాచారమ్.
అయితే తాజా వార్తల ప్రకారం నయనతార ఈ సినిమాకి డేట్స్ కేటాయించే పరిస్థితిలో లేదట. సూపర్ స్టార్ రజనీకాంత్ 'దర్బార్' తో పాటు విజయ్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాని అంగీకరించింది నయనతార. ఈ నేపధ్యంలో 'పొన్నియన్ సెల్వన్' కి డేట్స్ కేటాయించలేకపోతోందట. దాంతో నయనతార స్థానంలో అనుష్కను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మణిరత్నం. ఇది నిజంగా మంచి ఆఫర్. అందుకే అనుష్క ఈ సినిమాకి నో చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెన్నయ్ టాక్.