హిట్ డైరెక్టర్స్ ని నిర్మాత దిల్ రాజు అసలు వదిలిపెట్టరు. వారితో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి హిట్ ని క్యాష్ చేసుకోవడానికి దిల్ రాజు పక్కా ప్లాన్ గీస్తుంటారు. ప్రస్తుతం ఆయన దృష్టి 'జెర్సీ' తో హిట్ కొట్టిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిపై పడింది. ఈ డైరెక్టర్ తో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
గౌతమ్ తిన్ననూరి చెప్పిన ఓ స్టోరీ లైన్ దిల్ రాజుకి బాగా నచ్చిందట. ఈ స్టోరీ లైన్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి కూడా వినిపించాడట గౌతమ్. స్టోరీ లైన్ విని వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దాంతో స్ర్కిఫ్ట్ కి తుదిమెరుగులుదిద్దే పనిలో గౌతమ్ తిన్ననూరి ఉన్నట్టు సమాచారమ్. దిల్ రాజు నిర్మాతగా వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఎఫ్ 2' ఈ యేడాది సంక్రాంతికి విడుదలై హిట్ సినిమాగా నిలిచింది. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్, దిల్ రాజు, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ అంటే... భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. సో... మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందని ఊహించవచ్చు.