సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' చిత్రం రేపు (9.5.2019) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా స్పెషల్ షోల ప్రదర్శనకు తెలంగాణా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది.
తెలంగాణాలోని సింగిల్ స్ర్కీన్స్ లో ఉదయం 8 గంటల నుంచి 'మహర్షి' చిత్రాన్ని ప్రదర్శించుకోవచ్చని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. దాంతో రేపట్నుంచి ఈ నెల 22 వరకూ 5 షోలు స్క్రీనింగ్ చేసుకునే అవకాశం దక్కింది. అంటే 14 రోజుల పాటు 5షోలు స్ర్కీనింగ్ కానున్నాయి. ఈ పర్మిషన్ దక్కడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సమ్మర్ హాలీడేస్ ని ఎంచక్కా క్యాష్ చేసుకోవచ్చు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుని ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం.