'గీత గోవిందం' చిత్రం అందుకున్న విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పరశురామ్ కి బంపర్ ఆఫర్ తగిలిందని ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఆ ఆఫర్ వివరాల్లోకి వెళితే...
డైరెక్టర్ పరశురామ్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. ఈ స్టోరీ లైన్ మహేష్ బాబుకి తెగ నచ్చిందట. ఫుల్ స్ర్కిఫ్ట్ రెడీ చేయమని చెప్పాడట మహేష్. ప్రస్తుతం పరశురామ్ ఇదే పని మీద ఉన్నాడని సమాచారమ్. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించడానికి సమాయత్తమవుతున్నారని సమాచారమ్. వచ్చే యేడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని వినికిడి. అన్నీ కుదిరి ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే, పరశురామ్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు.