మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బెస్త కమ్యూనిటీ (ఫిషర్ మ్యాన్స్) కి చెందిన బ్యాక్ డ్రాప్ తో ఈ లవ్ స్టోరీ తెరకెక్కనుంది. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకి హీరోయిన్ ఖరారయ్యింది. మంగళూరుకి చెందిన క్రితి శెట్టి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకి 'ఉప్పెన' టైటిల్ ని ఖరారు చేసారు. మే 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.