సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' చిత్రం మే 9న విడుదలై వసూళ్ల పరంగా విజృంభిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకుదూసుకెళుతోంది. 11 రోజుల రన్ లో 90 కోట్ల షేర్ ని సాధించి బ్రేక్ ఈవెన్ కి దగ్గరపడుతోంది. దాంతో మహేష్ బాబుతో పాటు ఈ సినిమా నిర్మాతలు, బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. ఇక నైజాం ఏరియాలో ఆల్ రెడీ ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...
తాజా వార్తల ప్రకారం నిన్న (19.5.2019) అర్థరాత్రి షోలతో మ్యాజిక్ ఫిగర్ అయిన 25కోట్ల షేర్ ని దాటేసి లాభాల బాట పట్టేసింది 'మహర్షి'. ఈ సినిమా నైజాం రైట్స్ వ్యాల్యూ 22కోట్లు. ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ లు లేవు కాబట్టి 'మహర్షి' రన్ కొనసాగుతూనే ఉంటుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఏ ఫిగర్ ని టచ్ చేస్తాయో వేచిచూడాల్సిందే.