సూపర్ హిట్ చిత్రం 'మన్మధుడు' కి సీక్వెల్ గా 'మన్మధుడు2' చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జున. రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రీసెంట్గా పోర్చుగల్లో నెల రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరిగింది. మన్మథుడు 2 ఇన్స్పిరేషన్తో మన్మథుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడర్గా రూపొందిస్తున్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెలకిషోర్, రావు రమేష్ సహా నటీనటులందరూ పోర్చుగల్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. తాజాగా త్వరలోనే కొత్త షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభించడానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోందట. 'మన్మధుడు' లా 'మన్మధుడు 2' కూడా భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో చిత్రం యూనిట్ ఉంది.