సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ని ఫిక్స్ చేసారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ బాబు అభిమానులు అగ్రహంగా ఉన్నారు. 'మహర్షి' చిత్రం ఆల్బమ్ ఆశించిన రేంజ్ లో సక్సెస్ అవ్వకపోవడమే దీనికి కారణం. దాంతో దేవిశ్రీ ప్రసాద్ ని మహేష్ బాబు, అనిల్ రావిపూడి చిత్రానికి సంగీత దర్శకుడిగా తీసుకోవద్దని మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా పెద్ద ఎత్తున హల్ చల్ చేసారు.
అయితే తాజా వార్తల ప్రకారం మహేష్, అనిల్ రావిపూడి సినిమాకి దేవిశ్రీప్రసాద్ నే సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసారట. అడ్వాన్స్ కూడా ఇచ్చేసారట. దాంతో ఈ సినిమా చేసే అవకాశం తమన్ చేజారినట్టేనని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 31న జరిపి జూన్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశముందని సమాచారమ్.