ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ కి రాంచరణ్ గాయం వల్ల బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
తాజా వార్తల ప్రకారం త్వరలో ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని కోకాపేటలో జరగనుందని తెలుస్తోంది. ఇక్కడ ఓ భారీ సెట్ ని ఈ సినిమా కోసం వేయించారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సెట్ లో ఎన్టీఆర్, రాంచరణ్ పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. అలాగే అలియాభట్, రాంచరణ్ లపై కూడా కొన్ని సీన్లు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. కోకాపేటలో షూటింగ్ పూర్తి చేసిన అనంతరం ఈ చిత్రం యూనిట్ పూణే వెళ్లనుందని సమాచారమ్.