నిర్మాత దిల్ రాజు ఓ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో స్టార్ హీరోతో చేయబోతున్న ఈ సినిమాకి ఇంకా డైరెక్టర్ ఖరారవ్వలేదు. అయితే ఏ హీరోతో ఈ ప్రతిష్టాత్మక సినిమా చేయాలనే విషయంలో క్లారటీగా ఉన్నాడట దిల్ రాజు. ఆ స్టార్ హీరోతో చర్చలు కూడా జరుపుతున్నాడట. ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయంలోకి వెళితే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో దిల్ రాజు 'మున్నా', 'మిస్టర్ పర్ ఫెక్ట్' చిత్రాలు నిర్మించాడు. ముచ్చటగా ఈ హీరోతో మూడో సినిమా చేయాలనే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నాడట. ఈ ప్రపోజల్ ని ప్రభాస్ ముందు ఉంచితే... ''సినిమా చేద్దాం డార్లింగ్... మంచి కథ రెడీ చేసుకో'' అని అన్నాడట. దాంతో ప్రభాస్ కోసం మంచి స్టోరీ రెడీ చేయించే పనిలో పడ్డాడట దిల్ రాజు.
ప్రస్తుతం ప్రభాస్'సాహో' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలకానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్ డేట్స్ ని పట్టేసి, తనే సినిమా నిర్మించాలని దిల్ రాజు పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇందుకోసం కొంతమంది డైరెక్టర్స్ తో చర్చలు జరుపుతున్నాడని కూడా సమాచారమ్. మరి ప్రభాస్ మెచ్చే స్ర్కిఫ్ట్ తో అప్రోచ్ అవ్వబోయే డైరెక్టర్ ఎవరో... ప్రభాస్ తో దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమా కల నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే.