'మజిలీ' సక్సెస్ ను కొనసాగించడానికి నాగచైతన్య తెలివిగా అడుగులు వేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మామయ్య వెంకటేష్ తో కలిసి 'వెంకీమామ' చిత్రం చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమాపై ఆల్ రెడీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గ్యారంటీ హిట్ అని ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోతున్నాయి.
తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సైన్ చేసాడు నాగచైతన్య. ఇందులో సాయిపల్లవి హీరోయిన్. ఇది కూడా పక్కా క్రేజీ ప్రాజెక్ట్. ఈ రెండు సినిమాలు నాగచైతన్య మార్కెట్ ని పెంచుతాయని ప్ర్యతేకంగా చెప్పక్కర్లేదు.
నిజం చెప్పాలంటే ఓవర్ సీస్ లో నాగచైతన్య మార్కెట్ పెరగడంలేదు. ఇక్కడ హిట్ కొట్టిన 'మజిలీ' కూడా ఓవర్ సీస్ లో 'ప్రేమమ్' కంటే తక్కువ వసూళ్లనే సాధించగలిగింది. శేఖర్ కమ్ములకు ఓవర్ సీస్ లో క్రేజ్ ఉంది. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ములతో సినిమా చేయడం వల్ల ఓవర్ సీస్ లో తన మార్కెట్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నాడట నాగచైతన్య. సో... 'మజిలీ' సక్సెస్ ని కొనసాగించడానికి, తన మార్కెట్ ని పెంచుకోవడానికి నాగచైతన్య తెలివిగానే అడుగులు వేస్తున్నాడని చెప్పొచ్చు.