'మన్మధుడు' సీక్వెల్ 'మన్మధుడు 2' చిత్రంతో బిజీగా ఉన్న కింగ్ నాగార్జున తదుపరి చిత్రంగా 'సోగ్గాడే చిని నాయనా' సీక్వెల్ 'బంగ్రారాజు' చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. 'బంగార్రాజు' చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి తీసుకురావాలని భావిస్తున్న నాగ్ త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందట.
నాగార్జున సరసన రమ్యకృష్ణను తీసుకున్నారని తెలుస్తోంది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర చేయబోతున్నాడట. నాగచైతన్య సరసన కీర్తిసురేష్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారమ్. 'సోగ్గాడే చినినాయనా' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల 'బంగార్రాజు' కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.