మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఈ రోజు (24.6.2019) ప్రారంభోత్సవం జరుపుకుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాశిఖన్నాహీరోయిన్ గా నటించనుంది. 'సుప్రీమ్' సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. మరోసారి సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంట రిపీట్ కానుంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి 'ప్రతి రోజు పండగే' టైటిల్ ని ఫిక్స్ చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నఈ సినిమాకి పండగలాంటి టైటిల్ ని ఖరారు చేసారు కాబట్టి... ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని ఊహించవచ్చు. గీతా ఆర్ట్స్ , యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది.