మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'డిస్కో రాజా'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సినిమా ఆరంభంరోజునే చిత్రం యూనిట్ ప్రకటించింది. పాయల్ రాజ్ ఫుత్, నభా నతేష్ ఇప్పటికే హీరోయిన్లు గా కమిట్ అయ్యారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.
పాపులర్ కన్నడ హీరోయిన్ తాన్య హోప్ ని మూడో హీరోయిన్ గా తీసుకన్నారని సమాచారమ్. 'నేను శైలజ', 'అప్పట్లో ఒక్కడుండేవాడు', 'పటేల్ సార్' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది తాన్య హోప్. ఇప్పుడు రవితేజ సరసన సినిమా చేయబోతోంది. మరి ఈ సినిమా తర్వాత తాన్య టాలీవుడ్ లో నిలదొక్కుకుని వరుసగా సినిమాలు చేస్తుందేమో వేచిచూద్దాం.