నితిన్ హీరోగా తెరకెక్కిన 'రెచ్చిపో' చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ ఇద్దరూ మళ్లీ జత కట్టబోతున్నారనే వార్త వినబడుతోంది. ఇదే కనుక నిజమైతే 10యేళ్ల తర్వాత నితిన్, ఇలియానా కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇంతకీ ఏ సినిమా కోసం ఈ ఇద్దరూ జత కట్టబోతున్నారో తెలుసా...
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. కాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ని కథానాయికలుగా తీసుకున్నారు. తాజాగా ఇలియానాని కూడా ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఇలియానా ఈ సినిమాలో చేయబోతున్న క్యారెక్టర్ గురించి తెలియడంలేదుగానీ, 10యేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందనే వార్త అందరినీ ఆకర్షిస్తోంది. పైగా ఇలియానా అభిమానులు ఆమె తెలుగు సినిమాలు చేయకపోవడం పట్ల చాలా నిరాశగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేసింది. మళ్లీ నితిన్ తో సినిమా కమిట్ అయ్యింది. మరి ఈ సినిమా తర్వాత అయినా ఇలియానా టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ దక్కించుకుని వరుసగా సినిమాలు చేస్తుందేమో వేచిచూడాల్సిందే.