సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ తో సినిమా చేస్తున్నారు. కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ అందరికీ స్వీట్ షాకిచ్చింది. ఆ అప్ డేట్ ఏంటంటే...
డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేసారు. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా నటిస్తున్న మహేష్ బాబు పేరు 'అజయ్ కృష్ణ' అని ట్వీట్ చేసారు. ఆ పేరు ఉన్న బ్యాడ్జి ఫోటోను షేర్ చేసారు అనిల్ రావిపూడి. దాంతో మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా నటిస్తున్నారనే క్లారటీ వచ్చేసింది. ఫస్ట్ టైమ్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు మహేష్ బాబు. ఈ అప్ డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.