మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమాని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ ని సెట్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. ఖైదీ.నెం.150 కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. సైరా నరసింహారెడ్డి లో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ నేపధ్యంలో చిరు తదుపరి సినిమాకి బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని తీసుకురావాలని భావిస్తున్నాడట డైరెక్టర్ కొరటాల.
తాజా వార్తల ప్రకారం ఐశ్వర్యరాయ్ ని హీరోయిన్ గా తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడట కొరటాల. చిరు కూడా ఐశ్వర్యారాయ్ పట్ల మొగ్గుచూపుతున్నట్టు సమాచారమ్. దాంతో రాంచరణ్ రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్ తో మాట్లాడి, కథ వినిపించి ఆమెను అంగీకరింపజేయాలని భావిస్తున్నాడట చరణ్. ఒకవేళ ఐశ్వర్యరాయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హెల్ప్ తీసుకునే అవకాశముందని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే చిరు ఫ్యామిలీతో అమితాబ్ బచ్చన్ కి ప్ర్తత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మరి ఫైనల్ గా ఐశ్వర్యారాయ్ ఈ సినిమాకి హీరోయిన్ గా సెట్ అవుతుందో లేదో వేచిచూద్దాం.