యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా థియేటర్స్ కి రానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరోవైపు అన్నీ కుదిరితే, క్రేజీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని, ఆ సినిమా 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆరంభమవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. ఆ సినిమా ఏంటీ... ఎవరా క్రేజీ డైరెక్టర్ అనే వివరాల్లోకి వెళితే...
'కెజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'కెజిఎఫ్ 2' సినిమా చేస్తున్నాడు. కాగా ఈ డైరెక్టర్ తో సినిమా సెట్ చేయమని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు చెప్పాడట ఎన్టీఆర్. ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చి, ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేయమని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రశాంత్ నీల్ కూడా అంగీకరించాడట. 'కెజిఎఫ్ 2' చిత్రం పూర్తయిన వెంటనే, ఎన్టీఆర్ సినిమా మీదే ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టబోతున్నాడని సమాచారమ్.
'ఆర్ఆర్ఆర్' చివరి దశలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కోసం పూర్తి స్ర్కిఫ్ట్ రెడీ చేసి, ఈ సినిమాని 2020చివరిలో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. సో... ఎన్టీఆర్ ని మెప్పించగల కథతో ప్రశాంత్ నీల్ రెడీ అయితే, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని ఫిక్స్ అయిపోవచ్చు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశం మైత్రి మూవీ మేకర్స్ కి దక్కుతుంది. మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి కథతో ఎన్టీఆర్ ని అప్రోచ్ అవుతాడో వేచిచూద్దాం.