'వినయ విధేయ రామ' చిత్రం తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను తదుపరి సినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. నటసింహం నందమూరి బాలకృష్ణతో బోయపాటి సినిమా ప్రకటన వచ్చింది. కానీ ఈ సినిమాకి బోయపాటి 60 నుంచి 70 లక్షలు బడ్జెట్ ఇవ్వడంతో, ప్రస్తుతానికి ఈ సినిమా హోల్డ్ లో పెట్టారని సమాచారమ్. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తమ బ్యానర్ లో బోయపాటి దర్శకత్వంలో సినిమా ఉంటుందని 'గుణ 369' సినిమా ట్రైలర్ లాంఛ్ లో ప్రకటించారు. దాంతో గీతాలో బోయపాటి చేయబోతున్న సినిమాకి హీరో ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.
చాలామంది బోయపాటి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాకి సంబంధించి ఎప్పుడో చర్చలు జరిగాయి. అయితే కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గీతా అధినేత అల్లు అరవింద్ ప్రయత్నాలు మొదలుపెట్టారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అదే కనుక జరిగితే చిరు, బోయపాటి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా రూపుదిద్దుకుంటుందని ఊహించవచ్చు. ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించి ఫుల్ క్లారటీ రావాలంటే మెగా కాంపౌండ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంటుంది. ఆ ప్రకటన కోసం వేచిచూద్దాం.