యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సాహో' చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తలు రావడం, ఆగస్ట్ 30న సినిమాని విడుదల చేస్తారనే వార్తలు ప్రచారమవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో అయితే 'సాహో' ఆగస్ట్ 30న కాదు.. దీపావళికి థియేటర్స్ కి వస్తుందనే వార్త కూడా ప్రచారమవుతోంది. దీంతో 'సాహో' విడుదల విషయంలో కొంత కన్ ఫ్యూజన్ నెలకొంది. ఈ కన్ ఫ్యూజన్ కి నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టారు. దీపావళి వరకూ ఈ సినిమా విడుదల ఉండదనే సోషల్ మీడియా వార్త తప్పుడు వార్త అని తేల్చేసారు. ఆగస్ట్ 30న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసారు. సో... ప్రభాస్ అభిమానులు నిరాశపడాల్సిన అవసరంలేదు. దీపావళి వరకూ సినిమా విడుదల వాయిదా పడలేదు. ఆగస్ట్ 30నే సినిమా థియేటర్స్ కి రానుంది.