రానా దగ్గుబాటి హెల్త్ కి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కిడ్నీ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్ తో రానా భాదపడుతున్నాడని, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికిరాలేదు. అయితే తాజా వార్తల ప్రకారం రానా యు.యస్ వెళ్లాడు. అది కూడా తన తల్లితో కలిసి యు.యస్ వెళ్లాడు. ఎందుకు అనే వివరాల్లోకి వెళితే...
కిడ్నీకి సంబంధించిన ట్రీట్ మెంట్ కోసమే రానా తన తల్లితో కలిసి యు.యస్ వెళ్లాడని సమాచారమ్. అక్కడ ఫేమస్ నెప్రాలజిస్ట్ రానాకి ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నారట. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాలా లేక వేరే ట్రీట్ మెంట్ ఇవ్వాలా అన్న విషయంపై డాక్టర్ డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. రానాకి కిడ్నీ ట్రాన్ ప్లాంట్ అవసరమైతే తన కిడ్నీని డొనేట్ చేయడానికి రానా తల్లి సుముఖంగానే ఉన్నారు. మరి రానాకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుందా వేచిచూద్దాం.