విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ చిత్రానికి రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే పూరి వైపు నుంచి కొన్నికండీషన్లు ఉన్నాయట. ఆ కండీషన్స్ కి మైత్రి మూవీ మేకర్స్ అంగీకరిస్తేనే, ఈ సినిమా నిర్మించే అవకాశం వారికి దక్కనుందని తెలుస్తోంది. ఆ కండీషన్స్ ఏంటనే వివరాల్లోకి వెళితే...
మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు పూరి బ్యానర్ తో కలిసి సినిమా నిర్మించడానికి అంగీకరిస్తేనే ఈ సినిమా నిర్మించే అవకాశం వారికి దక్కుతుందట. అలాగే ఛార్మీ అధ్వర్యంలో సినిమా నిర్మాణం జరగాలట. ఈ రెండు కండీషన్స్ కి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు అంగీకరిస్తేనే, విజయ్ దేవరకొండ సినిమాని నిర్మించే అవకాశం మైత్రికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట పూరి. మరి ఈ రెండు కండీషన్స్ కి మైత్రి మూవీ మేకర్స్ అంగీకరిస్తారా వేచిచూద్దాం.