కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై తెరకెక్కిన ఈ సినిమా రేపు (ఆగస్ట్ 9) థియేటర్స్ కి వస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది.
కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగింది. దాంతో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందనే చర్చ జరుగుతోంది. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ సినిమా కర్ణాటక రైట్స్ కోటి రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. సీడెడ్ రైట్స్ నిమిత్తం 1.5 కోట్లు దక్కాయట. ప్రతి ఏరియాలోనూ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ అనుకున్న స్థాయికంటే బాగానే జరిగిందని సమాచారమ్. మరి ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందో, ఎంత లాభాలు తెచ్చిపెడుతుందో వేచిచూడాల్సిందే.