యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో యు.వి.క్రియేషన్స్ అధినేతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ 'మిర్చి' తో ఆరంభమైన యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా సక్సెస్ ని చవిచూస్తూనే 'బాహుబలి' లాంటి ప్రతిష్టాత్మక సినిమాని కోలీవుడ్ లో పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆంధ్రాలో సినిమాలను పంపిణీ చేయడం మొదలుపెట్టారు. 'రంగస్థలం' సినిమా నైజాం హక్కులను దక్కించుకుని తెలంగాణాలో కూడా అడుగుపెట్టారు.
తాజాగా టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను యు.వి క్రియేషన్స్ దక్కించుకుంది. ఇందుకుగానూ భారీ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారమ్. ఆగస్ట్ 30న యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న 'సాహో' చిత్రం విడుదలకానుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న యు.వి క్రియేషన్స్ పంపిణీ చేయబోతున్న 'సైరా' థియేటర్స్ కి రానుంది. ఈ రెండూ భారీ సినిమాలే. మరి ఈ రెండింటితో యు.వి క్రియేషన్స్ ఏ రేంజ్ విజయాన్ని చవిచూడనుందో వేచిచూద్దాం. రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటే, ఈ నిర్మాతల పంట పండినట్టే...!