వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వాల్మీకి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం గోదావరి పరిసర ప్రాంతాల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి కాంబినేషన్ లో రూపొందిన 'దేవత' చిత్రం ఎంత పెద్ద హిటయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ... ఎల్లకిల్లా పడ్డాదమ్మో...' పాటకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కాగా ఈ పాటను రీమిక్స్ చేసి 'వాల్మీకి' సినిమా కోసం వాడుతున్నారట. రీమిక్స్ చేసిన ఈ పాటను థియేటర్ లో చూస్తుంటే ఆడియన్స్ ఎగ్జయిట్ అవ్వడం ఖాయం. ఈ నెల 20న ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ లు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో వేచిచూడాల్సిందే.