జీవితరాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. పెద్ద కూతురు శివాని '2 స్టేట్స్' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవ్వాల్సి ఉంది. అయితే ఈ సినిమా వివాదంలో ఇరుక్కోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. రెండో కూతురు శివాత్మిక 'దొరసాని' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కాగా తాజా వార్తల ప్రకారం శివాని హీరోయిన్ గా నటించనున్న రెండో సినిమాకి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
బాల నటుడు తేజ హీరోగా రంగప్రవేశం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'ఓ బేబి' చిత్రంలో ఓ కీలక పాత్ర చేసాడు తేజ. కాగా తేజ హీరోగా 'నరుడా డోనరుడా' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన మల్లిక్ రామ్ దర్వకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తేజ సరసన శివానిరాజశేఖర్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ చిత్రానికి 'కల్కి' ఫేం ప్రశాంత్ వర్మ కథ అందిచడం విశేషం.సో... జీవితరాజశేఖర్ తనయ శివాని రెండో సినిమాకి రంగం సిద్ధమవుతోందన్నమాట. పస్ట్ సినిమా ఆగిపోయినప్పటికీ, రెండో సినిమాకి ఆసక్తికరమైన సెటప్ కుదిరింది. మరి ఈ సినిమాతో ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తీసుకోనుందో వేచిచూద్దాం.