ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తమ 8వ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియపరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుంది.
ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 'మే' నెలలో విడుదల అవుతుంది.