'సరిలేరునీకెవ్వరు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తదుపరి సినిమా #SSMB27 పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'మహర్షి' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రెండోసారి ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ కానుంది.
కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.యస్.యస్.తమన్ ని ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తీసుకున్నారట. 'అలా వైకుంఠపురంలో' సినిమాకి తమన్ అందించిన పాటలు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తమన్ ని తమ అభిమాన హీరో మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయడంపట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.