'అలా వైకుంఠపురంలో' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై విజయవిహారం చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు కురిపించిన సినిమాగా 'అలా వైకుంఠపురంలో' నిలిచింది. ఇంకా ఈ సినిమా వసూళ్లు తగ్గలేదు. ఇంత ఘనవిజయం సాధించిన నేపధ్యంలో 'అలా వైకుంఠపురంలో' సినిమా సక్సెస్ మీట్ ని వైజాగ్ లో నిర్వహించింది చిత్రం యూనిట్.
ఈ ఈవెంట్ తర్వాత తిరుపతిలో స్పెషల్ సక్సెస్ మీట్ ని నిర్వహించడానికి 'అలా వైకుంఠపురంలో' చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. రేపు ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో మరణించడంతో ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అల్లు అర్జున్ కి మేనమామ రాజేంద్రప్రసాద్ తో మంచి అనుబంధం ఉంది. అల్లు కుటుంబం మొత్తం ఈ విషాదంలో మునిగిపోయింది.