'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యు.యస్ లో హాలీడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే...
మహేష్ బాబు తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. తాజా వార్తల ప్రకారం కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. మహేష్ బాబు సరసన'భరత్ అనే నేను' సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వెంటనే రాంచరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది కియారా. ఇప్పుడు మళ్లీ రెండోసారి మహేష్ బాబుతో నటించే అవకాశం కియారాకి దక్కనుందని సమాచారమ్. ఇదే కనుక నిజమైతే అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.