సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ, ఫ్యామిలీతో కలిసి యు.యస్ లో ఉన్నారు. తాజా వార్తల ప్రకారం మహేష్ బాబు సర్జరీ చేయించుకోవడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. 'ఆగడు' సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు మోకాలికి గాయం అయ్యింది. ఆ సమయంలోనే మోకాలికి శస్ర్త చికిత్స చేయించుకున్నారు మహేష్ బాబు. అయితే డాక్టర్స్ అడ్వయిజ్ చేసినట్టు రెస్ట్ తీసుకోలేదు. పూర్తిగా గాయం మానకముందే షూటింగ్స్ తో బిజీ అయిపోయారు.
ఇప్పుడు మోకాలి నొప్పి ఎక్కువ అవ్వడంతో డాక్టర్స్ మళ్లీ సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచించారట. అలాగే సర్జరీ అనంతరం 5 నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని అడ్వయిజ్ చేసారట. ఈ నేపధ్యంలో ఈ నెలాఖరుకు సర్జరీ చేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు 5 నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నారట. సో... సర్జరీ చేయించుకున్న తర్వాత ఏప్రిల్ వరకూ మహేష్ బాబు యు.యస్ లోనే ఉండే అవకాశముంది. మే నెల నుంచి వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాని సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేయాల్సిందిగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మహేష్ బాబు సూచించినట్టు సమాచారమ్.