మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. కరోనా కారణంగా లాక్ డౌన్ మోడ్ లోకి చిత్ర పరిశ్రమ వెళ్లిపోయింది కాబట్టి, ఈ సినిమా విడుదల విషయంలో క్లారటీ లేదుకానీ... అన్ని సవ్వంగా ఉంటే సమ్మర్ కానుకగా విడుదలై ఆడియన్స్ ని అలరించేది ఈ సినిమా. ప్రస్తుతం థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీడంలేదు. దాంతో కొన్ని సినిమాలు ఓటిటి ఫ్లాట్ పామ్ పై విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది.
తాజా వార్తల ప్రకారం 'ఉప్పెన' కు కూడా ఓ టాప్ ఓటిటి ఫ్లాట్ పామ్ భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ ఆఫర్ ని నిర్మాతలు తిరస్కరించినట్టు తెలుస్తోంది. డైరెక్ట్ గా థియేటర్స్ లోనే సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా 'ఉప్పెన' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో ఆల్బమ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.