మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ విజయశాంతి... ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరూ నటించిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్. హిట్ పెయిర్ గా ఈ కాంబోకి జనాల నుంచి కితాబులు. చిరు, విజయశాంతి డ్యాన్స్ చేస్తుంటే అద్భుతంగా ఉంటుందని మెగాభిమానులు మురిసిపోయేవారు. 13 యేళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మరో సినిమాకి సైన్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందోకానీ... ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
మలయాళ చిత్రం 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. 'సాహో' ఫేం సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా మలయాళ వెర్షన్ లో మంజు వారియర్ చేసిన పాత్రను విజయశాంతితో చేయించాలనుకుంటున్నారట. విజయశాంతి ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తే... చాలా యేళ్ల తర్వాత హిట్ కాంబో చిరు, విజయశాంతిని తెరపై చూసే అవకాశం కలుగుతుంది. మరి విజయశాంతి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో వేచిచూద్దాం.