మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోసియుమ్' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ లో బాలయ్య, రానా నటిస్తే బాగుంటుందని భావించిన నాగవంశీ ఈ దిశగా ప్రయత్నాలు చేసారట. అయితే బాలయ్య ఈ సినిమాకి నో చెప్పారని సమాచారమ్.
తాజా వార్తల ప్రకారం ఈ రీమేక్ కి బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. మలయాళ వెర్షన్ లో బిజు మీనన్ చేసిన పాత్రను వెంకీ చేయనున్నారని తెలుస్తోంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా చేస్తున్నారు వెంకీ.