ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రస్తుతం ఓ విషయంలో డైలమాలో పడిపోయారని తెలుస్తోంది. దీనికి కారణం థియేటర్స్. నైజాం ఏరియాలో దిల్ రాజు అధీనంలో చాలా థియేటర్స్ ఉన్నాయి. పెద్ద సినిమాలను నైజాంలో పంపిణీ చేస్తారు దిల్ రాజు. ఆ రకంగా ఆయన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, థియేటర్ బిజినెస్ ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగుతుంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో చిత్ర పరిశ్రమ లాక్ డౌన్ మోడ్ లో ఉంది. థియేటర్స్ బంద్ అయిపోయాయి. ఎప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయి.. తెరుచుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిపై చిత్ర పరిశ్రమ ఆందోళనలో ఉంది. ఈ నేపధ్యంలో కొంతమంది చిన్న నిర్మాతలు ఓటిటి ఫ్లాట్ పామ్ పై తమ సినిమాని విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దిల్ రాజు సైతం ఓటిటి ఫ్లాట్ పామ్ వైపు దృష్టి సారించారట. అయితే దీనిపై డెసిషన్ తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో విడుదలకు నోచుకోలేదు. ఈ నేపధ్యంలో 'వి' చిత్రాన్ని ఫ్లాట్ పామ్ లో విడుదల చేయాలనే ఆలోచన దిల్ రాజుకు ఉందట. కానీ థియేటర్స్ ని రన్ చేస్తున్న తను ఓటిటి ఫ్లాట్ పామ్ ని ప్రోత్సహిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట దిల్ రాజు. అందుకే 'వి' సినిమాని ఓటిటిలో విడుదల చేసే విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారని సమాచారమ్.
సో... ఈ డైలమాతో దిల్ రాజు 'వి' సినిమాని ఓటిటి ఫ్లాట్ పామ్ పై విడుదల చేసే అవకాశంలేదని చెప్పొచ్చు.