విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, దివంగత నందమూరి తారక రామారావుగారి జయంతి రేపు (28.5). ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు నుంచి టిడిపి పార్టీ డిజిటల్ మహానాడును నిర్వహిస్తోంది. ఇక ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్ గార్డెన్స్ ని సందర్శించి దివంగత నేతకు నివాళులు ఆర్పించే సంప్రదాయాన్ని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కొనసాగిస్తూ వస్తున్నారు.
కాగా రేపు ఎన్టీఆర్ గార్డెన్స్ ని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించడం లేదు. కరోనా కారణంగా పబ్లిక్ సేఫ్టీని పరిగణనలోకి తీసుకుని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లోనే తమ తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు ఆర్పిస్తామని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెలియజేసారు. పబ్లిక్ గ్యాదరింగ్ ఈ సమయంలో ఏ మాత్రం మంచిది కాదు కాబట్టి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.