సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాకి 'గీత గోవిందం' ఫేం పరశురామ్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆరంభమైన తర్వాత ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. ఇక ఈ సినిమాకి హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వాని. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజా వార్తల ప్రకారం మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ సినిమాకి కూడా కియారా అద్వానీనే హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మహేష్ బాబుతో రెండోసారి రొమాన్స్ చేయబోతోంది కియారా అద్వాని.
మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే ని పురస్కరించుకుని #SSMB27 టైటిల్, హీరోయిన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.