మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఆ రోజున మహేష్ బాబు 27వ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరపడానికి ఈ చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసారట. ఈ వేడుక జరపడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసారట.
కాగా తాజా వార్తల ప్రకారం మే 31న సినిమా ప్రారంభోత్సవం జరపడానికి పోలీస్ పర్మిషన్ దొరకలేదని సమాచారమ్. ఎలాంటి హంగామా లేకుండా, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సినిమా ప్రారంభోత్సవం జరుపుతామని చిత్ర నిర్మాతలు చెప్పినప్పటికీ పోలీసులు పర్మిషన్ దొరకలేదని తెలుస్తోంది. దాంతో ఆన్ లైన్లోనే ఈ సినిమా టైటిల్ ని మహేష్ బాబు స్వయంగా విడుదల చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టెక్నీషియన్స్ లిస్ట్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.