సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాకి 'గీత గోవిందం' ఫేం పరశురామ్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని ఫైనలైజ్ చేయాలా అనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తమన్, గోపీ సుందర్ పేర్లు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా గోపీ సుందర్ ని తీసుకోవాలనుకుంటున్నారట. 'గీత గోవిందం' సినిమాకి గోపీ సుందర్ చక్కటి పాటలిచ్చాడు. ఈ సినిమా ఆడియో ఆల్బమ్ హిట్టయ్యింది. ఈ నేపధ్యంలో గోపీ సుందర్ నే మహేష్ బాబు సినిమా కోసం తీసుకోవాలని డైరెక్టర్ పరశురామ్ భావిస్తున్నాడట. అయితే తమన్ వైపు మహేష్ బాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే ని పురస్కరించుకుని #SSMB27 టైటిల్, టెక్నీషియన్స్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ ఇద్దరిలో ఎవరికి బంపర్ ఆఫర్ తగిలిందనే విషయంలో క్లారటీ వస్తుంది. ఫైనల్ గా మహేష్ బాబు ఎవరికి ఓటేస్తారో చూద్దాం.