స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని గత యేడాది డిసెంబర్ లో కేరళ ఫారెస్ట్ లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ తో షూటింగ్ లు నిలిచిపోయాయి. ప్రస్తుతం త్వరలో షూటింగ్ లు చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. ఈ నేపధ్యంలో 'పుష్ప' తదుపరి షెడ్యూల్ కి సంబంధించి ప్లానింగ్ జరుగుతోందట.
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో, ఎక్కువ శాతం షూటింగ్ ఫారెస్ట్ లో జరగాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలు వెళ్లడం కుదరదు. కేరళలో షూటింగ్ చేయడం కూడా జరిగే పనికాదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో నెక్ట్స్ షెడ్యూల్ చేయాలని భావిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. తెలంగాణాలో అయితే వికారాబాద్ ఫారెన్ట్, ఆంధ్రాలో అయితే ఈస్ట్ గోదావరిలోని మారేడుపల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఈ రెండు ఫారెస్ట్ ల్లో దేనిని సెలెక్ట్ చేసుకుని 'పుష్ప' షెడ్యూల్ ని ప్లాన్ చేస్తారో వేచిచూడాల్సిందే.