మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. కరోనా కారణంగా థియేటర్స్ బంద్ అవ్వడంతో ఈ సినిమా విడుదల విషయంలో క్లారటీ లేదుకానీ... అన్ని సవ్వంగా ఉంటే సమ్మర్ కానుకగా విడుదలై ఆడియన్స్ ని అలరించేది. ప్రస్తుతం థియేటర్స్ తెరుచుకోవడం కోసం చిత్రం యూనిట్ ఎదురుచూస్తోంది. థియేటర్స్ తెరుచుకోగానే, వెంటనే సినిమాని విడుదల చేయాలనే ప్లాన్ తో దర్శక, నిర్మాతలు ఉన్నారట. ఇదిలా ఉంటే...
ఫస్ట్ మూవీ విడుదలవ్వకముందే వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వైష్ణవ్ తేజ్ రెండో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆల్ రెడీ సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. సో... ఈ మెగా మేనల్లుడు ఫస్ట్ సినిమా విడుదలకాకముందే రెండో సినిమా కమిట్ అయ్యాడు. ఇక హీరోగా నిలదొక్కుకుని స్టార్ హీరో రేంజ్ కి ఎదుగుతాడేమో వేచిచూద్దాం.